చత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి.. ఈ నెల రోజుల వ్యవధిలో మూడో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారు జామునే మావోయిస్టులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు కాల్పులు ప్రారంభించడం.. మావోయిస్టులు ఎదురు కాల్పులు నేషనల్ పార్కు అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.