Trending Now

BREAKING NEWS పవన్​ కల్యాణ్​ పై రాయితో దాడి

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ప్రత్యర్థి పార్టీల నాయకులపై కార్యకర్తలు దాడికి దిగుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద దాడి జరిగి ఒక రోజైనా గడవకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దాడి జరిగింది. వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆయనపై రాయి విసిరాడు. అయితే ఈ దాడి నుంచి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నారు. దాడితో తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని జనసైనికులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. గుర్తు తెలియని వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దాడికి పాల్పడడంతో జనసేన కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సీఎం జగన్​మోహన్​ రెడ్డిపై దాడి జరిగి ఒక రోజు కూడా గడవక ముందే జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పై దాడి జరగడం చూస్తుంటే మున్ముందు ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు హింసాత్మకంగా మరే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Spread the love

Related News