Trending Now

కాంగ్రెస్​ గూటికి ‘కాలె’..?

ఒక్కొక్కరు బీఆర్​ఎస్​కు గుడ్​బై

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: బీఆర్​ఎస్ నేతలు ఆ పార్టీకి ఒక్కొక్కరు గుడ్​భై చెబుతున్నారు. ఆదివారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్​రావ్​ సీఎం రేవంత్​రెడ్డితో భేటీ అవడం నుంచి బీఆర్​ఎస్​ బిగ్​బాస్​ కోలుకునే లోపే మంగళవారంనాడు చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్​రెడ్డితో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది. ఇటీవల బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి, అలాగే వికారాబాద్​జడ్పీ చైర్​పర్సన్​ సునీతారెడ్డితో పాటు రంగారెడ్డి జడ్పీ చైర్​పర్సన్​ తీగల అనీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు ఆ పార్టీకి గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే! అయితే చేవేళ్ల లోక్​సభ స్థానాన్ని ఎలాగైనా కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కాంగ్రెస్​, బీజేపీకి చెందిన ముఖ్యనేతలపై కాంగ్రెస్​ ఆకర్ష్​ మంత్రం ప్రయోగిస్తోంది. ఈ ఆకర్ష్​ మంత్రానికి ఎవరెవరు ఆకర్షితులవుతారో వేచిచూడాల్సిందే మరీ!

Spread the love

Latest News