ప్రతిపక్షం, వెబ్డెస్క్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రేవంత్ దంపతులు కొడంగల్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు చేశారు. అనంతరం సీఎం ఏర్పాట్లపై అడిగి తెలుసుకుని అభివాదం చేశారు.
రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం@9AM
లోక్సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్లో ఇప్పటివరకు 10.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఉ.9గంటల వరకు ఏపీలో 9.05%, బిహార్ 10.18%, జమ్మూ కశ్మీర్ 5.07%, ఝార్ఖండ్ 11.78%, మధ్యప్రదేశ్ 14.97%, ఒడిశా 9.23%, మహారాష్ట్ర 6.45%, తెలంగాణ 9.51%, యూపీ 11.67%, వెస్ట్ బెంగాల్లో 15.24% ఓటింగ్ రికార్డు అయినట్లు ఈసీ వెల్లడించింది.