ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి హద్దు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎక్స్ లో విమర్శించారు. పూజ సరిగా చేయలేదంటూ.. కాకినాడలోని ఓ గుడిలో పూజారులపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.
అర్చక సోదరులపై వైసిపి దాడి దుర్మార్గం
— Lokesh Nara (@naralokesh) March 26, 2024
రాష్ట్రంలో వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారు. తమ ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు.… pic.twitter.com/6jIpceuxY3