Trending Now

India vs England 5th Test Day 3: టీమిండియా ఆలౌట్‌..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్‌ లెజెండరీ పేసర్‌ కుల్దీప్‌ యాదవ్‌(30)ని వెనక్కి పంపగా.. షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా(20) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఇంగ్లండ్‌ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్‌ బషీర్‌ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్‌ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్‌ ఆండర్సన్‌ రెండు, కెప్టెన్‌ స్టోక్స్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది.

Spread the love