శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

ప్రతిపక్షం, జూలై 28: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాడు సరాన్ష్ జైన్‌కు తొలిసారిగా జాతీయ టెస్ట్ జట్టులో అవకాశం కల్పించారు.

జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ ఆధారంగా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ వెల్లడించింది. శుభ్‌మన్ గిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ ఉప కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (ఉప కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుథార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.

శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి జరుగుతుంది. ఈ సిరీస్‌లో విజయంతో కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చక్రాన్ని శుభారంభం చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

Spread the love

Related News

Latest News