Trending Now

రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి మృతి..

ప్రతిపక్షం, నేషనల్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న సంతాన్ బుధవారం గుండెపోటుతో మరణించారు. సంతాన్ అలియాస్ టి. సుతేంద్రరాజా(55) శ్రీలంక జాతీయుడిగా ఉన్నారు. ఇతను మాజీ ప్రధాని హత్య కేసులో 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022లో సుప్రీంకోర్టు విడుదల చేసిన ఏడుగురిలో ఒకరిగా ఉన్నాడు. ఉదయం 7.50 గంటలకు సంతాన్ మృతి చెందినట్లు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డీన్ ఇ థెరానీరాజన్ తెలిపారు.

Spread the love

Related News

Latest News