CUET UG ఫలితాల్లో టాపర్‌గా BJP లీడర్ కూతురు

ప్రతిపక్షం, జూన్ 24: సీయూఈటీ అండర్‌గ్రాడ్యుయేట్ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన దేవీనా అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంక్ సాధించారు. 1232.19 స్కోరుతో ఆమె దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దేవీనా, ఢిల్లీ మాజీ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ నేత కైలాశ్ గహ్లోత్ కుమార్తె.

కుమార్తె అఖిల భారత తొలి ర్యాంక్ సాధించడం పట్ల కైలాశ్ గహ్లోత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, కేంద్ర మాధ్యమిక విద్యా మండలి పరీక్షల్లో కూడా దేవీనా 99 శాతం మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

తన విజయ రహస్యంపై స్పందించిన దేవీనా, రోజుకు పది నుంచి పన్నెండు గంటలు చదవలేదని, ప్రతి రోజూ తనను తాను మరింత మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో క్రమశిక్షణగా సిద్ధమయ్యానని తెలిపారు.

Spread the love

Related News

Latest News