Trending Now

నేడు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ విడుదల చేయనుంది. మొదటి జాబితాలో తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితా కోసం దాదాపు 60 నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు జరిగినట్లు సమాచారం. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు. రెండో జాబితాలో మరికొన్ని స్థానాలకు ప్రకటించే అవకాశం ఉంది.

Spread the love

Related News