Trending Now

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత..

ప్రతిపక్షం, నేషనల్: సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ బుధవారం న్యూఢిల్లీలో (95) కన్నుమూశారు. వయసు మీద పడటంతో అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. ఆర్టికల్ 370ని విమర్శించి ఫాలీ నారీమన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. 1991-2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఫాలీ నారీమన్ చేశారు. 1991లో పద్మభూషన్, 2007లో పద్మవిభూషణ్‌ను ఫాలీ నారీమన్ అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఫాలీ నారీమన్ సేవలందించారు.

Spread the love

Related News