Trending Now

ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి బెయిల్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి బెయిల్ మంజూరైంది. ఐదు వారాల మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉండటంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. పాస్‌పోర్ట్‌ సరెండర్ చేసి, భార్యకు హైదరాబాద్‌లో చికిత్స చేయించేందుకు అనుమతినిచింది. ఈడీ అధికారులకు ఫోన్‌ నెంబర్ ఇవ్వాలని.. సంబంధిత అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Spread the love

Latest News