Trending Now

బీఆర్ఎస్ – బీఎస్పీ మ‌ధ్య పొత్తు ఖరారు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: త్వర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్​, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ సీఎం కే.చంద్రశేఖర్​రావుతో భేటీలో పొత్తుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఎస్సీకి ఏ స్థానం కేటాయిస్తారు? లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ పోటీ చేస్తుందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పొత్తుపై ఇరు పార్టీల అధ్యక్షుడు ఉమ్మడి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Spread the love

Latest News