Trending Now

కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3,500ల కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులపై తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టదలచుకోలేదని సుప్రీంకోర్టుకు నివేదించింది.

Spread the love

Related News