Trending Now

కాంగ్రెస్‌ సర్కార్‌పై కవిత ఫైర్..

జీవో నెం.3తో ఆడబిడ్డల నోట్లో మట్టి కొట్టారు..

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డల కడుపుకొట్టేందుకు తీసుకొచ్చిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేయాలని బీఆర్​ఎస్​ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. సోమవారంనాడు జూబ్లీహిల్స్​లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో3 తో ఆడబిడ్డల నోట్లో మట్టి కొడుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జీవోతో మహిళలు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. నిన్న ఇచ్చిన గురుకుల పోస్టుల్లో కేవలం 77 మాత్రమే వచ్చాయని.. 6వేల ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 70 మాత్రమే అని అన్నారు.

మహిళలకు అన్యాయం చేసే జీవో3 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈనెల 8న మహిళ దినోత్సవం రోజు ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్‌లు ధరించి ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. మోదీ పెద్దన్న అని రేవంత్ రెడ్డి సంబోదించారని.. దీంతో బీజేపీ – కాంగ్రెస్ ఒక్కటే అని అర్థమవుతోందన్నారు. ఒక్క రూపాయి కేంద్ర బడ్జెట్‌లో ఇవ్వని మోదీ ఎలా పెద్దన్న అవుతాడో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

Spread the love