Trending Now

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు


ఢిల్లీ, ప్రతిపక్షం ప్రతినిధి: : బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. దిల్లీలో శుక్రవారం బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. నాగర్​కర్నూల్​ లోక్​సభ అభ్యర్థిగా పోతుగంటి రాములును బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టబోతోంది.

Spread the love