[t4b-ticker]

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా భారాస ఆందోళన..

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ భారాస ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రైతులు, పేదలు, సామాన్య ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

భూముల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరింత క్లిష్టతరం చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. 22ఏ జాబితాలో చేర్చిన భూములపై సమగ్ర విచారణ చేపట్టి, అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజల భూములకు రక్షణ కల్పించాలని, రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Spread the love

Related News

Latest News