Trending Now

యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్య రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటంబ సభ్యులతోపాటు వెళ్లి ఆయనను కలిసింది అనన్య. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఉన్నారు.

ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో పాలమూరుకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లో చదివిన అనన్య, ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె, 2020 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి.. యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్‌గా నిలిచారు.

Spread the love

Related News