Trending Now

కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై CM రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ‘కాంగ్రెస్ మీద చేయి వేస్తే మాడిపోతావు. మర్యాదగా ఉండటానికి నేను జైపాల్ రెడ్డి, జానా రెడ్డిని కాదు. మా కార్యకర్తలతో నీ బట్టలిప్పదీసి ఉరికించి కొడతా’ అని కేసీఆర్‌ను హెచ్చరించారు. మెదక్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు మోదీ, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. మెదక్ ప్రాంతంలో ఇందిరాగాంధీ తెచ్చిన పరిశ్రమలే ఇంకా ఉన్నాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే సీజన్‌లో రూ.500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేస్తానని తెలిపారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు.

Spread the love

Related News