Trending Now

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎంఎల్సీ ఉపఎన్నికపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కెసిఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Latest News