Trending Now

ఎన్నికల వేళ ఎస్పీకి షాక్.. ఎంపీ అభ్యర్థి నిషాద్‌కు తీవ్ర అస్వస్థత

ప్రతిపక్షం, వెబ్ డెస్క్:ఎన్నికల వేళ సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి షాక్ తగిలింది. యూపీలోని గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు లక్నోలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. నిషాద్ రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు ఆమె భర్త సంజయ్ నిషాద్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి కాజల్ నిషాద్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది.

Spread the love

Related News