Trending Now

కేసీఆర్ అలా చెప్పడం విడ్డురంగా ఉంది..

టీపీసీసీ నాయకులు గజ్జల కాంతం కామెంట్స్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డురంగా ఉందని టీపీసీసీ నాయకులు గజ్జల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశఆరు. బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ అయినవని.. 2014 నుండి ఇప్పటివరకు కేంద్రంలో నరేంద్రమోదీ ఏమి చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించార. మాకు 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని.. పేద, మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు, మళ్ళీ బీజేపీ గెలిస్తే దేశంలో సంపద అంతా బడా బాబులకు అప్పచెప్పుతారని ఆరోపించారు.

మణి పూర్‌లో జరిగిన సంఘటన కు మోడీ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని.. అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు తుపాకులు ఇచ్చి వందల మందిని చంపారన్నారు. ఆదానీ, అంబానీలకు ఖనిజ సంపద కోసం, మైనింగ్ కోసం వెలమందిని పొట్టన బెట్టుకున్నారని.. మోడీ నోరు ఇప్పటికి విప్పలేదు, దీనిని దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గుజరాత్‌లో 41వేల మంది దళిత, గిరిజనుల మహిళలను అత్యాచారం చేసి కనిపించకుండ చేశారని.. ఉత్తర ప్రదేశ్ లో 6వేల మంది దళిత యువకులను చంపితే మోడీ మాట్లాడలేదు.. ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేశారని పేర్కొన్నారు. వర్గీకరణపై ఎందుకు బిల్లు పెట్టలేదని.. దుర్మార్గ పరిపాలన చేస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తున్న మంద కృష్ణ మాదిగ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణ లో మాదిగలను మోసం చేసి ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దళితులను చంపుతారని.. వర్గీకరణ చేసి దళితులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని తెలిపారు.

Spread the love

Related News