Trending Now

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. యూపీలో ఇద్దరు చైనీయుల అరెస్టు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనా పౌరులను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సిద్ధార్థనగర్‌లోని కక్రాహ్వా పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చైనీయులు నేపాల్‌కు చేరుకుని అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా.. సహస్త్ర సీమ బల్(ఎస్ఎస్‌బీ) అధికారులు వారిని అడ్డుకున్నారు. సరైన సమాధానం చెప్పక పోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని చైనాలోని సిచువాన్‌కు చెందిన జౌ పులిన్‌గా, మహిళను చైనాలోని చాంగ్‌కింగ్‌కు చెందిన యువాన్ యుహాన్‌గా గుర్తించారు.

Spread the love

Latest News