Trending Now

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి..

ప్రతిపక్షం, తెలంగాణ: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిమల్కాపూర్‌లో చోటుచేసుకుంది. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శీలం బాలకృష్ణ మొదటి కుమారుడు శీలం మనోజ్ (20) నగరంలోని దుండిగల్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. గత రెండు నెలల క్రితం లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు సుమారు 3 లక్షల రూపాయలు రెండు నెలల క్రితమే చెల్లించారు. కాగా, మరిన్ని యాప్ లో లోన్లు ఉండడంతోనే తన కొడుకు ను లోన్ యాప్ ఏజెంట్లు వేధించడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయినట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love