[t4b-ticker]

యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు పరామర్శ

ప్రతిపక్షం, ఆగస్టు 27: అనారోగ్యంతో హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి.. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం.. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి కూడా ఆస్పత్రికి వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అనారోగ్యానికి గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్‌ ఆరోగ్యంపై మరిన్ని వివరాలను వైద్యులు వెల్లడించాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News