Trending Now

కర్ణాటకలో ‘మంకీ ఫీవర్’ కలకలం..

ప్రతిపక్షం, నేషనల్: కర్ణాటకలో మరో వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ‘మంకీ ఫీవర్’ చాపకింద నీరులా వ్యాపిస్తూ.. గ్రామల నుంచి మొదలై పట్టణాలకు కూడా వ్యాపిస్తోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో తాజాగా మరొకరు మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్‌ తాలూకా, కూర్లకై గ్రామానికి చెందిన ఓ మహిళ (60) మంకీ ఫీవర్‌తో 20 రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు. దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది.

ఈ నేపథ్యంలోనే మంకీ ఫీవర్ కేసుల పెరుగుదలపై కర్ణాటక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 100 దాటింది. మరోవైపు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంకీ ఫీవర్ కేసుల కట్టడికి చర్యలు చేపడుతోంది.

Spread the love

Latest News