Trending Now

ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఒకవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా.. మరోవైపు సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ ను వీడి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సురేష్ పచౌరీ ఆ పార్టీ నుంచి విడిపోయి బీజేపీలో చేరారు. రాజధాని భోపాల్‌లో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆయనకు స్వాగతం పలికారు.

Spread the love