Trending Now

కేజ్రీవాల్ కు షాక్.. ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే అన్న కోర్టు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 16న హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు ​పంపిన తర్వాత కూడా ఢిల్లీ సీఎం విచారణ కోసం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే కేజ్రీవాల్‌పై ఈడీ ఇప్పటికే కోర్టులో ఫిర్యాదు చేసింది.

Spread the love