Trending Now

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురి సజీవ దహనం

ప్రతిపక్షం, ఢిల్లీ: ఢిల్లీలోని శాస్త్రి నగర్‌ పరిధిలో ఈ వేకువ జమున నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు బాలికలు, దంపతులు మృతి చెందారు. మనోజ్‌, ఆయన భార్య సుమన్‌, ఐదేళ్లు, మూడేళ్లు ఉన్న ఇద్దరు బాలికలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. షాదారా వద్ద ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 5గంటల 20 నిమిషాలకు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది.

Spread the love