[t4b-ticker]

ప్రజల సుఖసంతోషాల కోసం శ్రీవారిని దర్శించుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

ప్రతిపక్షం, ఆగస్టు 21: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సంక్షేమం, అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ప్రార్థించారు.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు శక్తి, సామర్థ్యం, మంచి ఆలోచనా శక్తిని ప్రసాదించాలని శ్రీవెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందాలని, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

ప్రజల ఆశీస్సులు, శ్రీవారి అనుగ్రహంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని నవీన్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజల తరఫున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ప్రార్థించినట్లు తెలిపారు.

Spread the love

Related News

Latest News