Trending Now

‘జాహ్నవి ఫ్యామిలీకి న్యాయం చేయండి’.. ట్విట్టర్ వేదికగా KTR డిమాండ్

ప్రతిపక్షం, తెలంగాణ: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్‌‌ను సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గురువారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి.. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ గారు వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అన్నారు.

Spread the love

Latest News