Trending Now

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతిపక్షం, తెలంగాణ: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. లే ఔట్‌ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు కొత్తగా అప్లై చేసుకునేవారికీ మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప.. ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నది.

Spread the love