నీట్ వివాదంపై ఖర్గే ఫైర్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్

ప్రతిపక్షం, జూన్ 17: నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో వరుసగా అవకతవకలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

టెలిగ్రామ్‌పై ఆంక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదని ఖర్గే అభిప్రాయపడ్డారు. అసలు లోపాలను గుర్తించి పరీక్షా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. పేపర్ లీకేజీల వెనుక ఉన్న అసలు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు. విద్యార్థుల్లో పరీక్షా వ్యవస్థపై విశ్వాసం పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

Spread the love

Related News

Latest News