Trending Now

ప్రమాదానికి గురైన మాజీ ఎంపీ కారు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బిజూ జనతాదళ్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రసన్న ఆచార్య రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. భువనేశ్వర్‌ నుంచి సంబల్‌పూర్‌కు వెళ్తుండగా.. అతని కారు ఆక్సిజన్‌తో కూడిన ట్యాంకర్‌ను ఢీకొట్టింది. రైరాఖోల్‌లోని బలాదిహ్ సమీపంలో అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రసన్నతో పాటు అతని సెక్రటరీ, డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని విమానంలో భువనేశ్వర్‌కు తరలించనున్నారు. మరోవైపు ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Spread the love