Trending Now

పాక్‌ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ ఎన్నిక..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షెహబాజ్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్‌ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావటం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్‌ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు.

పాకిస్థాన్ పార్లమెంటులో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యుల మద్దుతు లభించింది. ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఆయనకు అంతకంటే ఎక్కువ మంది మద్దతు పలికారు. ఇటీవల పలు వివాదాల నడుమ పాక్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్, పీపీపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని నియామకం కోసం ఇవాళ పాక్ పార్లమెంటులో ఓటింగ్ జరిగింది. అందులో అత్యధికులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు కేవలం 92 మంది సభ్యుల మద్దతు లభించింది.

Spread the love

Latest News