[t4b-ticker]

వరలక్ష్మీ వ్రతం రోజు లంచం తీసుకుంటూ దొరికిన వరలక్ష్మి

ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణలో వరలక్ష్మీ వ్రతం రోజే ఓ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే రూ.20 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే నగదు రూపంలో లంచం తీసుకుంటే ఏసీబీకి పట్టుబడే అవకాశం ఉందన్న భయంతో మరో వ్యక్తి ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.13 వేలు బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

లంచం వ్యవహారంపై ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అయిన ఆధారాలను సేకరించి వరలక్ష్మిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, వరలక్ష్మీ వ్రతం రోజే ‘వరలక్ష్మి’ అనే పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో పలువురు ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. అధికార పదవిని ఉపయోగించుకుని లంచం డిమాండ్ చేస్తే ఎలాంటి మార్గంలో తీసుకున్నా అవినీతి నిరోధక శాఖ దృష్టికి వచ్చే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

Spread the love

Related News

Latest News