Trending Now

నేడు మంత్రిమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ పథకానికి అవసరమైన నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్‌ విచారణపై చర్చించి ఆమోదించనుంది. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి సిఫార్సు చేసే అవకాశం ఉంది.

Spread the love

Latest News