[t4b-ticker]

పెద్ది కుటుంబానికి కేసీఆర్ పరామర్శ.. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలోని వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పెద్ది కుటుంబానికి తాను, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నట్లు సమాచారం.

కేసీఆర్ నల్లబెల్లి పర్యటన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ రాకతో నల్లబెల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.

మరోవైపు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కుటుంబానికి అవసరమైన సమయంలో పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News