Trending Now

రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్..

హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్

ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నట్లు పేర్కొని క్రిష్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఈరోజు డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు.

డ్రగ్స్ కేసులో హైకోర్టులో క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసుల విచారణకు రాలేనని, తనకు మరో రెండు రోజుల సమయం కావాలని క్రిష్ కోరారు. కానీ నేడు క్రిష్ వ్యక్తిగతంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తెలపడంతో.. క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Spread the love