Trending Now

అత్యంత వృద్ధ ఎంపీ షఫీకర్ రెహ్మాన్ కన్నుమూత..

ప్రతిపక్షం, నేషనల్: యూపీలోని సంబాల్ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నాయకుడు షపీకర్ రెహ్మాన్ బార్క్ (94) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మొరాదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రెహ్మాన్ 1930 జూలై 11న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జన్మించాడు. రెహ్మాన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఎంపీగా గెలుపొందారు. 2019లో ఎస్పీ తరఫున సంబాల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై లోక్‌సభలో అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్నారు. గత నెల 30న ఎస్పీ రిలీజ్ చేసిన 16 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితాలోనూ షపీకర్ పేరు ఉండటం గమనార్హం.

Spread the love

Latest News