Trending Now

మాజీ ఎమ్మెల్యేకు నటి త్రిష లీగల్ నోటీసులు..

ప్రతిపక్షం, సినిమా: అన్నాడీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే రాజు ఇటీవల ప్రముఖ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రూ.25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్‌కు రప్పించామని, అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించామని రాజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనే కాకుండా, సౌత్ సినీ పరిశ్రమలో దుమారం రేగాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అనేకమంది త్రిషకు మద్దతు తెలిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో మాజీ ఎమ్మెల్యే రాజు తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పారు. తాజాగా.. ఈ మొక్కుబడి క్షమాపణ సరిపోదంటూ త్రిష సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో త్రిష డిమాండ్ చేసింది. లేకపోతే పరువునష్టం దావా వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Spread the love