Trending Now

కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి..

ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సుగుణ ను భారీ మెజార్టీతో గెలుపించండి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ మే 10 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ప్యారమూర్, తాండ్ర జి, సత్యసాయి నగర్, (వంజర్ ), వైకుంఠాపూర్, (ధోనిగాం ) గ్రామల లో సారంగాపూర్ జడ్పీటీసీ, నిర్మల్ జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రచార కార్యక్రమంలో పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి అని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారేంటీల పథకాలు చరిత్రత్మకమన్నారు. దేశ అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్, సారంగాపూర్ మండల అధ్యక్షులు బొల్లోజు నర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ, రాజ్ మహమ్మద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మసీరోద్దీన్, మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, మండల వైస్ ప్రెసిడెంట్ కొత్తపెళ్లి విలాస్ రావు మండల కాంగ్రెస్ నాయకులు, సయ్యద్ సలీం , శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగారెడ్డి,మధుకర్, సలీం రామ్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బట్టు భోజన్న రేగుంట గంగాధర్, నాయకులు పాలెపు నర్సయ్య, పెద్ద గంగన్న దయ నందు, కర్ణాకర్, గోవర్ధన్, గంగారెడ్డి, లింగారెడ్డి, ప్రశాంత్, ఒడణం మోహన్, కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, ఉపాధి హామీ కూలీలు, ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

Related News