Trending Now

అమరవీరుల స్థూపాని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు హరీష్ రావు అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో అమరవీరుల స్థూపాని పసుపు నీళ్లతో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ శుద్ధి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్ రావు అని.. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడం తో ఈ ప్రాంతం మైల పడిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని తెలిపారు.

10 ఏళ్లుగా హరీష్ రావు కి బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదు. హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారని స్పష్టంచేశారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారని.. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నువ్వు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా.. మండిపడ్డారు. ఆగస్ట్ 15 వ తేదీ లోగా 2లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ గారిని చెప్పామనండని ప్రశ్నించారు. ఆగస్ట్ 15 తర్వాత మీ రాజీనామా ఆమోదం చెందేలా ఎమ్మెల్సీ గా నేను బాధ్యత తీసుకుంటానన్నారు.

Spread the love

Related News