Trending Now

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Spread the love

Related News