Trending Now

గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. సవాల్ చేస్తూ అప్పీల్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: 2018 నాటి ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. కాగా, జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని ఇటీవల ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొన్న జాబితాను రద్దు చేసింది.

Spread the love

Related News

Latest News