Trending Now

ఏసీబీ వలలో లీగల్​ మెట్రాలజీ అధికారులు

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో: తూనికలు, కొలతలశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా లీగల్​ మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​ సింగబోయిన ఉమారాణితోపాటు సీనియర్​ టెక్నికల్​ అసిస్టెంట్​ డి. మల్లేశం రూ.10 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఉన్న నాట్కో ఫార్మా లిమిటెడ్​ కు చెందిన వేయింగ్​ మెషిన్స్​(బరువు కొలిచే యంత్రాలు)కు స్టాంపింగ్​ వేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్​ చేశారు.

ఒక్కో యంత్రానికి రూ.400 చొప్పున 25 యంత్రాలకు 10 వేలు ఇవ్వాలని, లేకుంటే స్టాంపింగ్​ చేసేదిలేదని యంత్రాలకు స్టాంపింగ్​ కోసం తీసుకువచ్చిన గిరిధర్​ రావుకు ఇన్​స్పెక్టర్​ చెప్పారు. చెప్పిన మొత్తాన్ని టెక్నికల్​ అసిస్టెంట్​ కు ఇవ్వాలని సూచించారు. దీంతో చేసేదేమి లేక బాధితుడు గిరిధర్​ రావు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని మల్లేశంను పట్టుకుంది. అనంతరం ఉమారాణితోపాటు మల్లేశం ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Spread the love

Latest News