గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్
ప్రతిపక్షం, హైదరాబాద్:
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన పార్టీ అధినేత కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రవీణ్ కుమార్ కు గులాబీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని పొత్తు కుదుర్చుకున్నామని అన్నారు. పొత్తు రద్దు చేసుకోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై వత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. ఇది తనకు ఇష్టం లేదని ఆయన తెలిపారు. కేసీఆర్ లాగ తాను కూడా మాట తప్పే మనిషిని కాదని అందుకే మాటకు కట్టుబడి ఉండేందుకే పార్టీలో జాయిన్ అవుతున్నానని తెలిపారు. నీది పాలమూరే నాది పాలమూరే అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డి తనను బెదిరించే ప్రయత్నం చేస్తునాడని అన్నారు. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు కానీ సైద్ధాంతికంగా పేదలు కాదు.. నలుమూలలు తిరిగి బహుజన వాదాన్ని ప్రచారం చేస్తానని అన్నారు.