Trending Now

‘విధ్వంసమైన జలదృశ్యాన్ని కల్లారా చూడబోతున్నాం’..

వైరల్​ అయిన సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలు దేరి మేడిగడ్డకు చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌ అయ్యింది. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని… మరమ్మతులకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై చిందులుతొక్కిన బీజేపీ.. వాస్తవాలు చూడడానికి రావడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు.
రేవంత్ ట్వీట్ ఇదే…
‘‘తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి కనీసం 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్‌తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు… వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Spread the love