తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయమే: రాంచందర్‌రావు

ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజాసేవ కంటే అధికారం ముఖ్యమని విమర్శించారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి లభించిన ప్రజా మద్దతు, కేరళలో కాంగ్రెస్‌కు వచ్చిన విజయం ప్రజల తీర్పేనని రాంచందర్‌రావు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో ప్రత్యామ్నాయ పాలన కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, తదుపరి ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News