Trending Now

పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలి..

జిల్లా వామపక్షల పిలుపు..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 18 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకొనుటకై ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లాలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని మామిడి రాజన్న భవన్ సీపీఎం కార్యాలయంలో గురువారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన జిల్లా నాయకులు కే రాజన్న, ఏం హరిత, ఠాకూర్ తిరుపతి లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నందిరామయ్య మాట్లాడుతూ.. దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్ని నాశనం చేసిందని, మతోన్మాద విధానాల్ని ముందుకు తెస్తూ.. మత విభజన రాజకీయాల్ని చేస్తూ రాజ్యాంగ వ్యవస్థల్ని, ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేస్తూ పరిపాలన కొనసాగించిందని మండిపడ్డారు.

బడా పెట్టుబడిదారులు ఆదానీ, అంబానీలకు దేశంలో ఉన్న 25 మంది బడ కార్పొరేటు శక్తులకు వ్యాపారులకు దేశ సంపదను కట్టబెట్టిందని, అన్ని రంగాలను ప్రైవేటు పరం చేసిందని, ఉద్యోగ భద్రతను లేకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని, 80 శాతం నిరుద్యోగ యువత ఇవాళ దేశంలో ఉద్యోగాలు లేక వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదనతో నిరాశతో ఉన్నారని మరొకసారి అధికారంలోకి రావడానికి మోడీ ప్రభుత్వం అనేక రకాలుగా ఎత్తుగడలతో ముందుకు వస్తుందని, అనేక రకాల తప్పుడు హామీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇస్తుందని, మత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగాన్ని, తీసుకురావడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

మధ్య యుగాల నాటి వ్యవస్థ బానిస వ్యవస్థను తీసుకురావడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని దుర్మార్గమైనటువంటి పద్ధతులకు పాల్పడుతుందని, ఇవాళ దేశంలో కార్మికులు, రైతులు, కూలీలు, యువత ఏ రంగంలో చూసిన అన్ని రంగాలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసే దిశగా పది సంవత్సరాల పరిపాలన కొనసాగిన తీరు దుర్మార్గమైనది. మరొకసారి ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ఎజెండాలో భాగంగానే అయోధ్య విషయాన్నిరాముడు విషయాన్ని ముందుకు తెచ్చిందని, గత ఎన్నికలకు ముందు పులువామా దాడులను వాడుకొని సైనికులను బలి చేసిందని, ఇవాళ మరొకసారి మోసం చేయడానికి రాముడు పేరును ముందుకు తెచ్చి.. ఈ దేశానికి రాముడే శ్రీరామరక్ష ఇవాళ ప్రజల బలహీనతలను మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని పరిపాలన చేయడానికి ముందుకు వస్తున్న బీజేపీని దానికి అనుకూలంగా ఉన్న శక్తులను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సీపీఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన కుమార్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జె రాజు, వామపక్ష పార్టీలకు చెందిన జిల్లా నాయకులు కామ్రేడ్ ఆర్ రామ లక్ష్మణ్, ఎం బక్కన్న, కే లక్ష్మి, సునారికారి రాజేష్, ఎండి గాపూర్, వెంకటేష్, శంభు, భోజన్న, ఆకుల సత్తన్న, డి పోశెట్టి, వర్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News